ఇంటర్ ఫైనల్ ఫలితాలు నేడు ఉదయం 11.30కు వెల్లడి..ఈసేవ, ఏపీ ఆన్లైన్, ఐవీఆర్ఎస్లో మార్కులు
హైదరాబాద్, న్యూస్లైన్: ఇంటర్ ఫైనలియర్ ఫలితాలు గురువారం ప్రకటించనున్నారు. ఉదయం 11.30కు ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జి. బలరామయ్య ప్రకటించారు. జనరల్, వొకేషనల్ పరీక్ష ఫలితాల్ని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి విడుదల చేస్తారు. ఫలితాలు విడుదల చేయగానే మార్కులు, గ్రేడుల్ని.. వెబ్సైట్, ల్యాండ్లైన్, ఈసేవా కేంద్రాలు, ఎస్ఎంఎస్ సహాయంతో తెలుసుకొనేందుకు బోర్డు ఏర్పాట్లు చేసింది. బీఎస్ఎన్ఎల్ ఐవీఆర్ఎస్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్)తోపాటు ఆరు ప్రభుత్వ వెబ్సైట్లు, ఈసేవా కేంద్రాలు, ఏపీ ఆన్లైన్ సేవా కేంద్రాల ద్వారా సబ్జెక్టుల వారీగా మార్కులు తెలుసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ద్వారా మొబైల్ ఫోన్లోనూ, ఎస్ఎంఎస్ సాయంతో మార్కులు వెల్లడిస్తారు. వెబ్సైట్ల ద్వారా గ్రేడ్లు తెలుసుకొనేందుకు అవకాశముంది.
ఏపీ ఆన్లైన్ ద్వారా మార్కులు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ ఆన్లైన్ సేవా కేంద్రాల్లోనూ మార్కులు తెలుసుకోవచ్చు. మార్కులు తెలుసుకొనేందుకు పరిష్కారం కాల్ సెంటర్(ఈసేవా), పట్టణ ఈ సేవా కేంద్రాలు, గ్రామీణ ఈసేవా(రాజీవ్ ఇంటర్నెట్) కేంద్రాల్లోని బిఎస్ఎన్ఎల్ ఫిక్స్డ్ ఫోన్లైన్ల ద్వారా 1100 కు డయల్ చేయవచ్చు. ల్యాండ్లైన్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా 18004251110 కు డయల్ చేసి మార్కులు తెలుసుకోవచ్చు.
వరంగల్, న్యూస్లైన్: వరంగల్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ-2011లో ప్రవేశానికి అడ్మిషన్ నోటిఫికేషన్ను నిట్ డెరైక్టర్ ప్రొఫెసర్ వేముల రామారావు సోమవారం విడుదల చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం నోటిఫికేషన్ను ప్రత్యేకంగా జారీ చేశారు. రెండేళ్ల ఎంబీఏ కోర్సులో ఫుల్టైమ్ మేనేజ్మెంట్ కోసం ఇంజినీరింగ్, టెక్నాలజీలో బ్యాచ్లర్ డిగ్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులను క్యాట్, జెమైట్, స్కోర్కార్డు కలిగి ఉండి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.
దరఖాస్తులు, ఇతర వివరాలను అభ్యర్థులు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.ఎసి.ఇన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. అభ్యర్థులు మార్చి 21వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని నిట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ హెడ్ డాక్టర్ రవీందర్రెడ్డి తెలిపారు. ఎంబీఏ-2011 అడ్మిషన్కోసం భోపాల్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ కోసం ఒక బ్రాంచ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన సూచించారు. నిట్ వరంగల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో మొత్తం 62 ఎంబీఏ సీట్లున్నాయని, ఒక్కోవిద్యార్థి ఏటా రూ. లక్షా 25వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
RECRUITMENT OF CLERICAL STAFF IN ASSOCIATE BANKS OF STATE BANK OF INDIA(ADVERTISEMENT NO. CRPD/ABCL/2010-11/04)
Date of Deposit of Fee : From 01.10.2010 To 30.10.2010 On-line Registration : From 01.10.2010 To 01.11.2010 Date of written examination : 16.01.2011 (Sunday)
Cash Voucher English http://www.4shared.com/document/VSrnxBiW/SBI_CLERICAL_RECRUITMENT_2010-.html
Notification Hindi http://www.scribd.com/doc/38700722/Sbi-Clerical-Recruitment-2010-11-Hnd-Andhramirchi http://www.4shared.com/document/Kd5Wmrrn/SBI_CLERICAL_RECRUITMENT_2010-.html
Cash Voucher Hindi http://www.4shared.com/document/izHIsV9U/SBI_CLERICAL_RECRUITMENT_2010-.html